పంట వేసిన రైతులందరూ తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలి, అలాగే రైతులు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అని విడవలూరు మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట కృష్ణయ్య పేర్కొన్నారు. విడవలూరు మండలంలోని చౌకచర్ల, పార్లచర్ల గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పరిధిలో రైతులకు పలు సూచనలు సలహాలు చేశారు.