విడవలూరు: మహిళ క్షేమం, భద్రత కోసం యాత్ర ప్రారంభించాము

80చూసినవారు
విడవలూరు: మహిళ క్షేమం, భద్రత కోసం యాత్ర ప్రారంభించాము
ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడులోని పినాకిని గాంధీ ఆశ్రమాన్ని జాగ్తే రహో భారత్ యాత్ర నిర్వాహకులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బాలికలపై లైంగిక అత్యాచారాలు, వేధింపులు, మహిళల భద్రత, స్వేచ్ఛ కోసం ఈ యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. దేశమంతటా ఈ యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. మహిళల క్షేమం, భద్రతలే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు.

సంబంధిత పోస్ట్