నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 44 రోజులకు గాను భక్తులు కానుకుల రూపంలో స్వామికి సమర్పించిన హుండీ ఆదాయం లెక్కించగా రూ. 19, 26, 80619,26,806 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.