ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్ 26, 272 మందికి 19, 282మంది పాసయ్యారు. 73శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 7వ స్థానంలో జిల్లా నిలిచింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో 22, 720మంది పరీక్షలు రాయగా 19, 848 మంది పాసయ్యారు. 87శాతం పాస్ పర్సంటేజీతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచింది. మొత్తంగా నెల్లూరు జిల్లాలో 48, 992 మంది పరీక్షలు రాయగా 39, 130 మంది పాసయ్యారు.