సింహపురి ఐక్య క్రైస్తవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నెల్లూరు నగరంలోని విఆర్సి కళాశాల గ్రౌండ్స్ లో క్రీస్తుతో సంగీత కార్యక్రమం విజయవంతంగా సాగింది. పలువురు ప్రస్తుత గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీస్తు గానాలను వినిపించారు. నెల్లూరు నగరం రూరల్ నియోజకవర్గానికి చెందిన వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.