నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద శనివారంతో భక్తుల సందడి ప్రారంభమైంది. రొట్టెల పండగ ఆదివారం నుంచి జరగనుంది. ఈ క్రమంలో ఒకరోజు ముందుగానే వేలాదిగా భక్తులు దర్గా వద్దకు తరలివస్తున్నారు. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండగ జరగనుంది. మత సామరస్యానికి చిహ్నంగా, బారాషహీద్ల త్యాగనిరతిని స్మరిస్తూ ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. స్వర్ణాల చెరువు వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది.