నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద ఉన్న బారాషహీద్ దర్గాలో సోమవారం రొట్టెల పండుగ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోరికల కోసం చెరువులో రొట్టెలు పంచుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. మొదటి రోజే క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.