నెల్లూరు: బడి ఈడు చిన్నారులందరూ బడిలో ఉండాలి

50చూసినవారు
నెల్లూరు: బడి ఈడు చిన్నారులందరూ బడిలో ఉండాలి
బడిఈడు చిన్నారులందరిని బడికి పంపించి వారి బంగారు భవిష్యత్‌కు బాటాలు వేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె. ఉదయభాస్కర్‌రావు అన్నారు. ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం నగరంలోని గాంధీబొమ్మ నుంచి వీఆర్‌సీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఏడి గౌస్ బాషా, ఐసిడిఎస్ పిడి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్