రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ మూడో శనివారం నిర్వహిస్తున్న బీట్ ద హీట్ కార్యక్రమంపై ప్రజలకు ముమ్మరంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బీట్ ద హీట్ కార్యక్రమంపై నెల్లూరులో కలెక్టర్ ఆనంద్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొవాలన్నారు.