ఈనెల 30వ తేదీన నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశం జరగనుంది. ఈ మేరకు జడ్పీ సీఈవో విద్యారమ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి జిల్లా, మండల పరిషత్ సవరణ బడ్జెట్, 2025-26 అంచనా బడ్జెట్ పై సమీక్ష నిర్వహిస్తారు.