కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై నమోదైన ఈడీ కేసులను ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత సంజయ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని తమ అధినేతలపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.