పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా నెల్లూరు రిత్విక్ ఎన్ క్లేవ్లోని వాటర్ట్యాంక్ పార్కులో శనివారం బీట్ ద హీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, నగర కమిషనర్ నందన్, స్థానిక నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానికులు, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.