వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో వ్యవసాయంలో కిసాన్ డ్రోన్ల వినియోగం-ఉపయోగాలపై జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాతలకు వ్యయప్రయాసలు లేకుండా తక్కువ ఖర్చుతో నూతన సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయన్నారు.