మే 15వ తేదీన నెల్లూరు రూరల్ లో పెద్ద ఎత్తున 339 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ఆహ్వాన పత్రికతో పాటు అభివృద్ధి కార్యక్రమాల బుక్ లెట్ ను తెలుగుదేశం పార్టీ నాయకుల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందజేశారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.