కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు గడిచినప్పటికీ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా జరుగుతున్నాయని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.