నెల్లూరు జిల్లాలో బుధవారం కారు అదుపుతప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. . కావలి వైపు నుంచి నెల్లూరుకు వస్తుండగా గొలగమూడి క్రాస్ సమీపంలో హైవేపై కారు అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుడు నెల్లూరులోని బీవీ నగర్ కు చెందిన పోలంరెడ్డి భాస్కర్ రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.