ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కార్తీక్, డిఆర్వో ఉదయభాస్కర్రావు పాల్గొన్నారు.