కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (పీఎంఐఎస్)ను జిల్లా యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ప్రభాకర్రెడ్డి కోరారు. కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ సూచన మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. మరోసారి గడువు పెంచారని, ఈ నెల 22 వరకు అవకాశం ఉందన్నారు.