నెల్లూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమరగిరి మహేంద్ర బాబు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఆనంద్ కు వినతి పత్రం అందజేశారు. బ్యాక్ లాగ్ పోస్టులలో కొంతమందికి అన్యాయం జరిగిందన్నారు. యానాదుల మహానాడు అధ్యక్షురాలు బాపట్ల సత్యవతి, ఇండ్ల రవి, పాల్గొన్నారు.