నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, 100 శాతం లక్ష్యాలను సాధించాలని కమిషనర్ సూర్య తేజ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, హౌసింగ్ విభాగం అధికారులు, సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.