నెల్లూరు పెన్నా తీరాన వెలసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూల అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.