రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ సునంద విమర్శించారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీం రచించినా దానివెనుక స్కాం తప్పకుండా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో లావణ్య తదితరులు పాల్గొన్నారు.