నెల్లూరు: ఆలయాభివృద్ధికి సహకరిస్తా: మంత్రి ఆనం

శ్రీ నాగవరపమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. సంగం మండలం కోలగట్ల గ్రామంలోని ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. నిర్వాహకులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గణనాథుడికి పూజలు చేసి తల్లిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతపై వివరాలు అడిగి తీర్థప్రసాదాలు స్వీకరించారు.