40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసుల పట్టాల సమస్యకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శాశ్వత పరిష్కారం చూపారు. గురువారం ఈ మేరకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి ఆమోదముద్ర వేయించారు. గత ప్రభుత్వ ఇచ్చిన దొంగపట్టాలతో మోసపోయిన వారికి శాశ్వత పట్టాలు ఇప్పించేందుకు మంత్రి చేసిన భగీరధ ప్రయత్నం ఫలించింది.