రైతు బజార్ల ద్వారా నాణ్యమైన బియ్యం, కందిపప్పులను బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందిస్తున్నట్లు ఇన్ చార్జ్ జాయింట్ కలెక్టర్ ఎం సూర్య తేజ తెలిపారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో మరింత మెరుగైన ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సంబంధిత వాటాదారులతో సమావేశం నిర్వహించారు. రైస్, దాల్ మిల్లర్ అసోసియేషన్, రేషన్ డీలర్ అసోసియేషన్, అధీకృత స్టాకిస్ట్ ల అభిప్రాయాలను సేకరించారు.