నెల్లూర్ జిల్లా వరికుంటపాడు మండల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ పాల్గొన్నారు. ఆమె రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. రైతులు, ప్రజలు వివిధ రకాల సమస్యలపై అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరికుంటపాడు జడ్పీటీసీ రావెళ్ళ నాగేంద్ర, ఎంపీడీఓ, సబ్ ఇన్స్పెక్టర్ ఎం.రఘునాథ్, పలువురు రైతులు పాల్గొన్నారు.