నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 35 డివిజన్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని డివిజన్ క్లస్టర్ ఇన్చార్జి షంషుద్దీన్ తెలిపారు. నెల్లూరు నగరంలోని స్థానిక లేక్యూ కాలనీలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 42 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో బర్నా బస్ శరత్ చంద్ర పాల్గొన్నారు.