నెల్లూరు రూరల్ పరిధిలోని 36వ డివిజన్లో కూటమి ప్రభుత్వం గత 11 నెలలుగా 1. 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు 36వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు పిండి సురేష్, అబ్దుల్ రసూల్ పేర్కొన్నారు. నెల్లూరు ఫతేఖాన్ పేటలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ స్థానిక పెండెం వారి వీధి పెన్షన్ లైన్, తామర లైను, మసీదు వీధి తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేశామన్నారు.