మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్థంతిని నెల్లూరు ఇందిరా భవన్లో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బాల సుధాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు సివి శేషారెడ్డి, బాల సుధాకర్ లు మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన సేవలను కొనియాడారు.