నెల్లూరు బారాషాహీద్ దర్గాలో ఆదివారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. రొట్టెల పండుగకు నగరపాలక సంస్థ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. దర్గా ప్రాంగణాన్ని ఏడు జోన్లుగా విభజించి ఎప్పటికప్పుడు శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారుల పర్యవేక్షణలో పారిశుధ్యపారిశుద్ధ్య కార్మికులు దర్గా ప్రాంగణాన్ని శుభ్రపరుస్తున్నారు.