వీపీఆర్ పాఠశాలలో 2023-24 సంవత్సరంలో చదివి టాప్ మార్కులు సాధించిన ఉదయగిరి లక్ష్మి చరణ్ అనే విద్యార్థికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉన్నత చదువుల ఖర్చు భరిస్తానని నాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు 2024లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫీజు చెల్లించారు. బుధవారం నెల్లూరు కార్యాలయంలో ఇంటర్ రెండో సంవత్సరం ఫీజును చెల్లించారు. ఈ మేరకు విపిఆర్ నివాసంలో విద్యార్థికి చెక్కును అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.