జిల్లాలో ఈనెల 12 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని డిఆర్వో చాంబర్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. డిఆర్వో ఉదయభాస్కర్రావు మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు సంబంధించి సూచనలు ఇచ్చారు.