జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా గురువారం నగరంలోని పూలే విగ్రహానికి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే దేశంలో అణిచివేత, అంటరానితనం, సామాజిక రుగ్మతలపై అలుపెరగని పోరాటాలు చేసిన తొలితరం నేతలలో ఒకరిగా నిలిచారని కొనియాడారు.