సమాజంలో బాల్యవివాహాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బాల్యవివాహాల ముక్తి భారత్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనాసుజన్ పిలుపునిచ్చారు. బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్లో కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాల ముక్తిభారత్ ప్రచార ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ పీడీ హేనా సుజన్ పాల్గొన్నారు.