నెల్లూరు జిల్లాను సారా రహిత జిల్లాగా జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టర్ వారి చాంబర్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నాటుసారా నిర్మూలనకు చేపట్టిన చర్యలను ఎక్సైజ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. అడిషనల్ ఎస్పీ సౌజన్య పాల్గొన్నారు.