నెల్లూరు రూరల్ నియోజకవర్గం చింతరెడ్డిపాళెంలోని, వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డిలో గురువారం నెల్లూరు రూరల్ 24వ డివిజన్ టీడీపీ నాయకులు కొలను సుధీర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మురళి యాదవ్, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.