పేద విద్యార్థులకు సరస్వతీ నిలయంగా విఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు వీఆర్ హైస్కూల్ ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు చేపట్టాలంటే అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్సిసి ఆధ్వర్యంలో పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.