మనుబోలు మండలం పిడూరు పాలెం గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్చకులు సత్యం స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. స్వామివారికి అమ్మవార్లకు పంచామృత అభిషేకం నిర్వహించి. తెల్లవారు నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.