నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డితో అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ గురువారం ఆత్మీయంగా భేటీ అయ్యారు. నెల్లూరు పర్యటనకు వచ్చిన ఎంపీ వేదాయపాళెంలోని క్యాంప్ కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఎంపీకి, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారిరువురు చర్చించుకున్నారు.