రాష్ట్ర వ్యాప్తంగా ‘తల్లికి వందనం’ నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైంది. తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. మనుబోలు మండలం కొమ్మలపూడికి చెందిన కుప్పంపాటి స్వప్న, ధనయ్య దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరికి రూ.39,000 జమయ్యాయి. గత ప్రభుత్వంలో ఒక్కరికే సాయం వచ్చిందని, ఇప్పుడు ముగ్గురికీ రావడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.