వెంకటాచలంలోని గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలో విశ్రాంత ఏఎస్ఐ రాజు సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం భోజనశాల లోకి ఓ వ్యక్తి చెప్పులతో లోపలికి వచ్చాడు. చెప్పులు బయట వదిలి రమ్మని చెప్పడంతో రాజుతో వాగ్వాదానికి దిగాడు. ఆ వ్యక్తి రాజు పై దాడి చేయగా రాజు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో సిబ్బంది రాజుని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది.