వెంకటాచలంలోని అక్షర విద్య లయంలో ఏటిసి3, ఎన్సిసి క్యాంప్ ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు నిర్వహించారు. ఈ క్యాంపులో ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు ఉన్నత పాఠశాలకు చెందినటువంటి 45 మంది విద్యార్థులు పాల్గొని శిక్షణ పొందినట్లు హెచ్ ఎం మల్లికార్జున పేర్కొన్నారు. విద్యార్థులకు శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ఫైరింగ్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి కార్తిక్ ను అభినందించారు.