నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవి కామదేనువు పునరుత్పత్తి కేంద్రంలోని 182 పశువులకు అధికారులు బుధవారం వేలం నిర్వహించారు. ఈ వేలంలో 66 ఆవులు, 49 దూడలు, గేదెలను రైతులు దక్కించుకున్నారు. మిగిలిన వాటికి మరోసారి వేలం నిర్వహిస్తామని జెడి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, జెడ్పిటిసి సభ్యుడు దామ మహేశ్వరరావు రైతులు పాల్గొన్నారు.