ఉదయగిరి మండలం బిజ్జంపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్. నాయబ్ భాషా ఆధ్వర్యంలో పేరెంట్స్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ మీ మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి ప్రైవేటు పాఠశాలల కంటే ఉన్నతంగా విద్యను అందిస్తాము, ఏ ప్రైవేటు పాఠశాలల్లో లేనివిధంగా సౌకర్యాలు స్టూడెంట్ డెస్క్, ఐ. ఎఫ్. పి ప్యానల్స్ అన్ని అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారు.