వరికుంటపాడు మండలం తూర్పురొంపిదొడ్ల గ్రామంలో మానసా దేవి అమ్మవారి పదోవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రెండో రోజు అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. భక్తులు ఆలయానికి చేరుకుని గోత్రనామాలతో అర్చనలు చేయించుకుని ప్రసాదాలు సేకరించారు.