పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జలదంకి మండలం కమ్మవారిపాలెం గ్రామంలో శనివారం బీట్ ద హీట్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతినెలా మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర. స్వచ్ఛ ఆంధ్ర పేరుతో ప్రభుత్వం పర్యావరణ హితం కోసం ప్రత్యేక థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.