రేపు జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొని లబ్ధిదారులు అందరికీ పెన్షన్లు అందేలా చూసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోరారు. ప్రతి ఒక్కరికీ మొదటి రోజే అందే విధంగా సచివాలయ సిబ్బంది తో కలసి సమన్వయం చేసుకుంటూ పంపిణీ చేపట్టాలని కాకర్ల సురేష్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.