కలిగిరి పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. కావలి, వింజమూరు వద్దగల సబ్ స్టేషన్లలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు.