రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అగ్నిమాపక సిబ్బంది గురువారం మండలంలోని గంగిరెడ్డి పల్లి గ్రామం ప్రాథమిక పాఠశాలలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.