ఉదయగిరిలోని ఆర్టీసీ బస్ షెల్టర్ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కూర్చోవడానికి సీట్లు లేకపోవడం, నిలబడటానికి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం వేచి చుస్తున్నారు. అధికారులు స్పందించి ఈ బస్ షెల్టర్ను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.